బాలయ్య మట్లాడితే.. 6 నెలల దాకా అర్థం కాదు -నందమూరి లక్ష్మీ పార్వతి

-

బాలయ్య మట్లాడితే.. 6 నెలల దాకా అర్థం కాదంటూ ఎద్దేవా చేశారు నందమూరి లక్ష్మీ పార్వతి. హిందూపురం ప్రజలకు సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. లోకేష్ పాదయాత్ర రోజుకో కామెడీ బావుందని.. ప్రతి పక్ష పార్టీ రోజు రోజు కు దిగజారి పోతుందని వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఏమీ రాని దద్దమ్మ, ఒక్క చోట గెలవని వ్యక్తి సీఎం జగన్ ను విమర్శిస్తున్నారని.. ప్రభుత్వ వైఫల్యాలను మీరు చెప్పలేని స్థితి, బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో పనికి మాలిన వెధవల్ని , ఇలాంటి కుక్కల్ని పోషిస్తున్నారని ఆగ్రహించారు. దుబాయ్, స్విట్జర్లాండ్ లో చంద్రబాబు ఐదు లక్షలు కోట్లు దాచి పెట్టాడు ఈ నల్లధనం స్వదేశానికి రప్పించాలన్నారు. ప్రధాని మోదీ ఈ నల్లధనం బయటకు తీసుకు రావాలని కోరుతున్నానన్నారు. పవన్ కళ్యాణ్ చదువుతున్న పుస్తకాలు జ్ఞానం ఎక్కడకి పోయింది.. ప్రజ వ్యతిరేకత అర్థం కాదని వివరించారు నందమూరి లక్ష్మీ పార్వతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version