CID చేతికి మదనపల్లె కేసు..!

-

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫిస్ అగ్నిప్రమాద ఘటన కేసు రోజుకో మలుపు తిరుగుతుంది అనే చెప్పాలి. ఈరోజు మధ్య్నహం ఇది ప్రమాదం కాదు.. ఎవరు కావాలనే చేసారు అని రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా వెల్లడించగా.. ఇప్పుడు ఈ కేసును CID కి ఇస్తున్నాం అని కర్నులు రెంజ్ డిఐజీ ప్రవీణ్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఒక ఎమ్మెల్యేల,మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసారు. పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషా పై కేసు నమోదు అయ్యింది.

ఈ కేసులో భాగంగా వీరి ఇంట్లో సోదాలు చేసిన సమయంలో.. ఇంటిలో ఉండకూడని పత్రాలు ఉన్నాయి. దానిపై కేసు నమోదు చేశాము. పత్రాలను ఎందుకు ఉన్నాయో విచారిస్తాం. ఇప్పటి వరకు జరిగిన సోదాలు, విచారణ లో ఎవరిని అరెస్టు చేయాలేదు. వారంలో పొరెన్సిక్ రిపోర్టు వస్తుంది. రిపోర్టరు అధారంగా విచారణ అరెస్టు ఉంటాయి అని డిఐజీ ప్రవీణ్ స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version