విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడే మొనగాడు కేసీఆర్ మాత్రమే – మల్లారెడ్డి

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడే మొనగాడు సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కీలక వాక్యాలు చేశారు.

రాబోయే రోజుల్లో విశాఖలో లక్ష మందితో సభ నిర్వహిస్తామని ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడడం ఎవరి తరం కాదని, కేవలం కేసీఆర్ వల్లే అవుతుందని ఏపీ ప్రజలు నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే అది కేవలం కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version