ఏపీని మోడీకి తాకట్టు పెట్టేందుకు బాబు, పవన్‌ పొత్తులు – మార్గాని భరత్

-

ఏపీని మోడీకి తాకట్టు పెట్టేందుకు బాబు, పవన్‌ పొత్తులు అంటూ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్ అయ్యారు. నిన్న సభలో చంద్రబాబు ప్రత్యేక హోదాను ఎందుకు అడగలేదు…నిన్న చిలకలూరిపేట లో జరిగిన సభ ఫ్లాప్ అయిందని విమర్శలు చేశారు. ప్రధానమంత్రి సభలో మైకులు పనిచేయలేదు….పరిస్థితులు, దేవుడు వారి పక్షాన లేడని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది బిజెపి…టిడిపి, బిజెపి, జనసేన కలయికలు అక్రమ కలయిక అంటూ ఫైర అయ్యారు.

Margani Bharat slams pm modi

గతంలో చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చాలా అనరాని మాటలు అన్నారు…చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు కలిసి రాష్ట్రాన్ని మోడీకి తాకట్టు పెట్టాలనుకుంటున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు….విలువలు విశ్వసనీయత అనే పదాలు చంద్రబాబు జీవితంలో తెలుసుకోలేరని ఫైర్‌ అయ్యారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తులు కాదని తెలిపారు. పార్లమెంట్లో పాస్ అయిన బిల్లులకు కూడా ఈ రోజుకి అతి గతి లేదని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news