వాలంటీర్లు దైవాంశ సంభూతులు – ఏపీ మంత్రి నాగార్జున

-

వాలంటీర్లు దైవాంశ సంభూతులు అని ఏపీ మంత్రి మేరగ నాగార్జున అన్నారు. ఇవాళ ఏపీ మంత్రి మేరగ నాగార్జున..తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్ల పై చేసే ఆరోపణలు అభూత కల్పనలేనని.. లోకేష్ పాదయాత్ర సంధర్భంగా మీడియా పై దాడి చేసిన వారి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

175 స్థానాల్లో పోటీ చేసేందుకు టిడిపికి అభ్యర్థులే లేరంటూ ఎద్దేవా చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరగ నాగార్జున కామెంట్స్ చేశారు. పేద ప్రజల కోసం జగన్ నిరంతరం పనిచేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభంజనం కొనసాగుతుందని వెల్లడించారు. జగన్ ను ఎవరూ అడ్డుకోలేరని.. దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారన్నారు.ఉన్నత కులాల్లోని పేదవారిని కూడా ఆదుకుంటున్నారని.. చంద్రబాబు మా కులాలను ద్వేషించారని ఫైర్‌ అయ్యారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని అన్నారని.. మమ్మల్ని పలుమార్లు అపహాస్యం చేశారని విమర్శలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news