రూ.లక్ష ఇస్తే గంగిరెద్దులతో పాటు మంత్రి అంబటి డ్యాన్స్ : పృథ్విరాజ్

-

మంత్రి అంబటి రాంబాబు పై ప్రముఖ కమెడియన్, జనసేన నేత పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల తర్వాత వచ్చే సంక్రాంతి గంగిరెద్దుల వాళ్లతో పాటు మంత్రి అంబటి రాంబాబును పిలవచ్చు అన్నారు. రూపాయలు లక్ష ఇస్తే గంగిరెద్దులతోపాటు అంబటి రాంబాబు కూడా డాన్స్ చేస్తాడని ఎద్దేవా చేశారు.కాగా.. వైసీపీకి రాజీనామా చేసిన పృథ్వీరాజ్ ఇటీవో లే జనసేన పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. జనసేనలో చేరిన వెంటనే పృథ్వీరాజ్ వైసీపీ నేతలే టార్గెట్గా విమర్శలను గుర్తిస్తున్నారు.

ఇదిలా ఉంటే వైయస్ షర్మిల సైతం అంబటి రాంబాబు డాన్స్ పై సెటైర్లు వేశారు. ఇవాళ కాంగ్రెస్ నేతలతో కలిసి గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించిన షర్మిల వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 750 కోట్లు పెట్టి గుడ్ల కమ్మ ప్రాజెక్టు నిర్మిస్తే ప్రస్తుత సీఎం జగన్ ఈ ప్రాజెక్టు నిర్వాహనను గాలికి వదిలేసారని విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వ పాలనకు ఈ ప్రాజెక్టు నిర్వాహనే నిదర్శనం అని ఎద్దేవా చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version