ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పై స్పందించిన మంత్రి నారా లోకేష్

-

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల మహిళా అధికారితో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న (సోమవారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్  పై తాజాగా మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందిచారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమని మంత్రి లోకేష్ మండిపడ్డారు.

“మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్ లో మీరు వాడిన లాంగ్వేజ్ కరెక్ట్ కాదు అని నారా లోకేష్ తేల్చి చెప్పారు. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచి మర్యాదల గురించి చెప్పాల్సిన పనిలేదు. అధికారం పోయిన అహంకారం తగ్గలేదు. ఐదేళ వైసీపీ పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు ఛీ కొట్టినా బుద్ధి రాలేదు” అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version