సీఎం జగన్ ప్రాజెక్టులను గాలికొదిలేశాడు – నారా లోకేష్

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారం కృష్ణాజిల్లా నూజివీడులో కొనసాగుతోంది. ఉదయం పోతిరెడ్డిపల్లి క్యాంపు సైట్ నుండి 195వ రోజు పాదయాత్రను ప్రారంభించారు లోకేష్. అయితే ఈ రోజు లోకేష్ – బ్రాహ్మణిల పెళ్లి రోజు కావడంతో పార్టీ శ్రేణులు, యువగళం వాలంటీర్లు లోకేష్ తో కేక్ కట్ చేయించారు. అనంతరం పాదయాత్రలో భాగంగా లోకేష్ ని నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామస్తులు కలిశారు.

చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి, పిట్టల వారి పాలెం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ కి అడ్డగోలు దోపిడీ మీద ఉన్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులపై లేదని మండిపడ్డారు. టిడిపి పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని.. 68 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఇందులో నాలుగో వంతు కూడా జగన్ సర్కారు ఖర్చు చేయలేదని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version