వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి ?

-

తిరుపతి జిల్లాలోని వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. నియోజకవర్గ నాయకులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకు ఎంపీ లాడ్స్ నుంచి నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

Nedurumalli as Venkatagiri YCP candidate

ఇక అటు కర్నూలు ఎంపీ స్థానం లో పోటీకి మంత్రి గుమ్మనూరు జయరామ్ ఆసక్తి చూపకపోవడంతో వైసీపీ అధిష్టానం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. 2014లో ఎంపీగా పనిచేసిన బుట్ట రేణుకకు మరోసారి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఆమె పేరును ప్రకటించనునట్లు తెలుస్తోంది. ఆలూరు టికెట్ ను విరూపాక్షికి కేటాయించడం తో సిట్టింగ్ ఎమ్మెల్యే జయరామ్ కు ఎంపీ స్థానం ఆఫర్ చేసిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news