అక్టోబర్ -1 నుంచి కొత్త పాలసీ : మంత్రి కొల్లు రవీంద్ర

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం విధానం పై కొత్త పాలసీని త్వరలోనే తీసుకురానుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని పేర్కొన్నారు. సొంత ఆదాయం పెంచుకునేలా.. ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టేలా గత ప్రభుత్వం మద్యం పాలసీ చేసుకుంది. నాటి మద్యం పాలసీ వల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింది.

కొత్త మద్యం పాలసీ రూపకల్పనపై కెబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. మంచి మద్యం పాలసీని త్వరలోనే తీసుకొస్తామని వెల్లడించారు. ముఖ్యంగా అక్టోబర్ -1 నుంచి కొత్త పాలసీని తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఆరు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నామని.. వాటిలో ఏది బాగుంటే దానిని ఆదర్శంగా తీసుకుంటామని తెలిపారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా పాలసీ రూపొందిస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఏపీలో గంజాయి వినియోగం పెరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version