ఆదిలాబాద్‌ ను మహారాష్ట్రలో కలపండి – బీజేపీ ఎమ్మెల్యే

-

Palvai Harish Babu: ఆదిలాబాద్‌ ను మహారాష్ట్రలో కలపండి అంటూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కార్‌ లో ఆదిలాబాద్‌ కు అన్యాయం జరుగుతోందని ఫైర్‌ అయ్యారు. ఇలా అయితే… ఆదిలాబాద్‌ ను మహారాష్ట్రలో కలపండి అంటూ డిమాండ్‌ చేశారు. సభలో పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ….సివిల్ సప్లై శాఖలో 53,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారన్నారు.

Palvai Harish Babu Comments On adilabad

ఇప్పుడు కేవలం 3,000 కోట్ల రూపాయలు రికవరి చేస్తామని చెప్పారు మిగతా 50,000 కోట్ల రూపాయలు ఎటు వెళ్ళాయని చెప్పారు. గత ప్రభుత్వం లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారన్నారు. కాంగ్రెస్ ఆరోపిస్తోంది brs ప్రభుత్వం ఒక ఎకరంకు కోటి రూపాయలు ఖర్చు చేసిందని వివరించారు. Brs కాళేశ్వరం..కాంగ్రెస్ ముక్తేశ్వర కాళేశ్వరం పై శ్రద్ధ పెడుతుందని ఆగ్రహించారు. నిధులు అన్ని నల్గొండ, ఖమ్మంకు తీసుకు పోతున్నారు..మా వెనుక బడిన ప్రాంతాల పరిస్థితి ఏంటి..? అని ఆగ్రహించారు. చనాక కొరటకు 300 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news