చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. ఆ విషయాలపై చర్చ

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఆయన నివాసంలో కలిశారు. ఈ భేటీలో మలివిడత అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు సమాచారం. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు దిల్లీ పరిణామాలపైనా అధినేతలు మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అన్ని చర్చించిన తర్వాత త్వరలోనే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ దిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.

మరోవైపు మంగళవారం రోజున జయహో బీసీ సభ నిర్వహించిన ఇరు పార్టీలు బీసీ డిక్లరేషన్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మరింత జోరు పెంచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈసారి ఎలాగైనా ఏపీలో తమ కూటమే అధికారంలోకి వస్తున్న ధీమాలో ఉన్న నేతలు ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ శంఖారావం పూరించనుంది. రేపటి నుంచి ఐదు రోజులు పాటు 12 నియోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version