దెబ్బపడే కొద్దీ జనసేన బలపడుతోంది.. పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్

-

ఎవరైనా గెలిచే కొద్ది బలపడుతుంటారు.. కానీ జనసేన మాత్రం దెబ్బపడే కొద్ది మరింత బలపడుతుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అసమానతలు, దోపిడీ విధానాలపై ఎదురు తిరగడానికే పార్టీని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. మచిలీపట్నంలో  జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్ పాల్గొన్నారు​. 2014వ సంవత్సరంలో మార్చి14న జనసేన పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు.

పార్టీ ఏర్పాటుకు స్ఫూర్తి స్వాతంత్య్ర ఉద్యమ నాయకులని పవన్‌ తెలిపారు. అణగారిన వర్గాలకు చేయూత ఇవ్వడానికి పార్టీ ఏర్పాటు స్థాపించానని అన్నారు. అగ్రకులాల్లో ఉన్న పేదలకు అండగా ఉండేందుకు పార్టీ ఏర్పాటు చేశానని వెల్లడించారు.

రెండు చోట్లా ఓడినా తనను ముందుకు నడిపింది పార్టీనేనని.. మహానుభావుల స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ నడిపిస్తున్నానని స్పష్టం చేశారు. ధైర్యమే తన కవచమని, ధైర్యం ఉన్నచోట లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతానని అన్నారు. జనసేనకు పిడుగుల్లాంటి జనసైనికులు అండగా నిలబడ్డారని పవన్ కల్యాణ్ ధైర్యం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version