శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌పై ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫిర్యాదు..

-

తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిసారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆనంతరం తిరుపతి ఎస్పీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్.. ఢిల్లీ కి వెళ్ళే అవకాశం ఉంది.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాటతీస్తామని యాదవ సంఘం నేతలు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, సిఐ అంజు యాదవ్ పై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని… ఒక మా బీసీ మహిళ ఎంతో కష్టపడి చదివి సిఐ స్థాయిలో ఉందని వెల్లడించారు యాదవ సంఘం నేతలు. ఆమె ఏ తప్పు చేయలేదని… రోడ్డుపై ఎవరైనా ధర్నా చేస్తే పోలీసు వృత్తి ప్రకారం అలా అడిగారు… బీసీ కా మహిళా కాబట్టి ఇలా లోకువగా మాట్లాడుతున్నావా గత ప్రభుత్వంలో వనజాక్షిపై చింతమనేని దాడి చేస్తే మీరు ఏం చేశారు అని యాదవ సంఘం నేతలు ఫైర్ అవుతున్నారు. సీఐ జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version