చంద్రబాబు కాళ్ళ దగ్గర చోటు ఉంటే చాలన్నది పవన్ ఆలోచన – పేర్ని నాని

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు కాళ్ల దగ్గర చోటు ఉంటే చాలు అన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన అని వ్యాఖ్యానించారు. పవన్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని.. పవన్ విధానాలు చూసే ప్రజలు ఓటెయ్యలేదన్నారు. ఇక 2024లో కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ కి ఓటు వేయరన్నారు పేర్ని నాని.

చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసమే పవన్ తాపత్రేయ పడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టేనన్నారు. ఎవరో సినిమా రైటర్ రాసిచ్చిన స్క్రిప్ట్ పవన్ చదివాడని ఎద్దేవా చేశారు. ఇప్పటంలో ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టలేదని, ఇప్పటం గ్రామం పరువు తీసింది ఎవరు? అని ప్రశ్నించారు. కోర్టు ముట్టికాయలు వేసిన మీకు బుద్ధి రాలేదని మండిపడ్డారు పేర్ని నాని. పవన్ కళ్యాణ్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version