పుంగనూరులో చిన్నారి హత్య కేసును చేధించిన పోలీసులు..

-

పుంగనూరులో చిన్నారి హత్య కేసును చేధించారు పోలీసులు. పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును చేధించారు పోలీసులు. ఈ తరుణంలోనే.. ఈ కేసును చేధించినట్టు స్వయంగా ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్‌ హోం మంత్రి అనిత. కేసులో ఇద్దరు ఆడవాళ్లు, ఒక యువకుడు ను అదుపులోకి తీసుకున్నారు పోలిసులు. దీనిపై సాయంత్రం ప్రెస్ మీట్ ద్వారా వివరాలు తెలుపనున్నారు.

Police crack a case of murder of a six-year-old girl in Punganur

ఇక అంతకు ముందు.. పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసు పై రోజా స్పందించారు. పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. వీడియో ద్వారా స్పందించారు. ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు పిల్లలను స్కూల్ కి పంపాలంటే భయమేస్తోందని… ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్ధత కాదా? అంటూ ప్రశ్నించారు రోజా. గత నెల 29 న అదృశ్యమైన పాప నాలుగు రోజులపాటు ఆ సమీప ప్రాంతాల్లో నే ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోయారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version