జోగులాంబ అమ్మవారి సన్నిధిలో మంత్రి శ్రీధర్ బాబు!

-

తెలంగాణ వ్యాప్తంగా దుర్గమాత నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తిపీఠంగా పిలువబడుతున్న జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ సమేతంగా సందర్శించుకున్నారు. ఆదివారం అలంపూర్ వచ్చిన మంత్రికి మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న శ్రీధర్ బాబుకు ఆలయ మర్యాదలతో ఈవో పురేందర్ పాలకమండలి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు కుటుంబం ముందుగా గణపతి పూజ నిర్వహించి అభిషేకాలు చేశారు.ఆ తర్వాత అమ్మవారి ఆలయం చేరుకుని కుంకుమార్చనతో పాటు యాగశాలలో ప్రత్యేక యాగం నిర్వహించారు.మంత్రి వెంట అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా ఉన్నారు. కాగా, దసరా పండుగ నేపథ్యంలో అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version