వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి పోలీసుల ఝలక్ !

-

చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసిపి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి పోలీసులు ఝలక్ ఇచ్చారు. మిథున్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్నారు పోలీసులు. పుంగనూరు మున్సిపల్ ఆఫీసులో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నేతలతో నేడు మిథున్ రెడ్డి సమావేశం నిర్వహించాల్సి ఉంది. అలాగే పట్టణంలో ఇటీవల మృతి చెందిన ఖాదర్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.

ఆయన పర్యటనపై ఆంక్షలు విధించారు. మిథున్ రెడ్డి పర్యటనకు టిడిపి శ్రేణులు అడ్డు తగిలే అవకాశం ఉందని చెబుతూ పోలీసులు ఆయన పర్యటనపై ఆంక్షలు విధించారు. కేవలం కౌన్సిలర్లకు మాత్రమే అనుమతి ఉందని చెబుతూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలను లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కాగా పుంగనూరులో గతంలో ఉద్రిక్త పరిస్థితిల దృశ్య దాదాపు 5,000 మందితో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news