ఏపీ విద్యార్థులకు శుభవార్త… ఇకపై ఉచితంగానే కోచింగ్…!

-

ఏపీ విద్యార్థులకు పొంగూరు నారాయణ శుభవార్త అందజేశారు. నారాయణ విద్యాసంస్థల్లో ఫ్రీగా కోచింగ్ అందుబాటులోకి తీసుకువచ్చారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. పేద విద్యార్థుల కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని తన గొప్ప మనసును చాటుకున్నారు.

narayana
Ponguru Narayana gave good news to AP students

ఐఐటి, నీట్ పరీక్షలలో కొద్ది మార్కుల తేడాతో సీట్లు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, వసతి గృహాలు, గురుకులాలలో చదివే విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థలలో ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సంవత్సరం 80 మందికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విద్యార్థులకు భోజనం, మెటీరియల్, వసతి ఉచితంగా అందిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news