నేడు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న పురందేశ్వరి

-

నేడు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు పురందేశ్వరి. ఇందులో భాగంగానే, నేడు విజయవాడకు పురంధేశ్వరి రానున్నారు. ఇవాళ ఉదయం 10.55 గంటలకు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు పురంధేశ్వరి. ఇక ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు పురంధేశ్వరి.

ఇదే విషయంపై బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. రాబోయే ఎన్నికలలో పురంధేశ్వరి నాయకత్వంలో ముందుకు వెళ్తామని.. 16 వ తేదీ ఎన్నికల కార్యాచరణపై ముఖ్య సమావేశం ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్, కార్యాచరణను కూడా అదే రోజు ప్రకటిస్తామని.. మెడికల్ విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ప్రభుత్వం జిఓ ఉందని వివరించారు. తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులకు చీకటి ఒప్పందం ఉంది…ఆస్తులు ,మెడికల్ విధ్యార్దుల విషయంలో తెలంగాణ చేస్తున్న మోసాన్ని ఎందుకు ఆంధ్ర ముఖ్యంమత్రి పట్టించుకోవటం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news