మరోసారి మెగా ఫ్యామిలీని కెలికిన అనసూయ.. అతడే టార్గెట్ అంటూ..!

-

బుల్లితెర గ్లామర్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరను వదిలి వెండితెరపై సత్తా చాటుతున్న విషయం తెలిసిందే .ఇకపోతే ముక్కు సూటిగా ఉండే ఈమె ఎప్పటికప్పుడు తనకు నచ్చింది మాట్లాడుతూ ఒక్కొక్కసారి వివాదాల్లోకి తలదూరుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె మెగా ఫ్యామిలీని కెలికిన విషయం చాలా వైరల్ గా మారుతోంది. సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు మాట్లాడే ప్రతి మాట కూడా వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఒకప్పటి కామెంట్స్ కూడా టైం చూసి కొంతమంది బయట పెడుతూ ఉంటారు.

ఇదే క్రమంలోనే అల్లు అర్జున్ పై గతంలో అనసూయ చేసిన షాకింగ్ కామెంట్లు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే జబర్దస్త్ బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి మెగా హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో కలిసి నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమా కూడా చేస్తోంది.మరి అలాంటి అనసూయ మెగా ఫ్యామిలీ అందులోనూ అల్లు అర్జున్ పై ఒకప్పుడు ఎలా రియాక్ట్ అయ్యింది? గంగోత్రి సినిమా సమయంలో అల్లు అర్జున్ పై ఆమె ఫీలింగ్స్ ఏంటి ?అన్నది ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో బయటకు తీసి రచ్చ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్..

గతంలో ఆమె మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీ అయితే హీరో అయిపోతారా ? గంగోత్రి సినిమా చూసి అసలు మన వాళ్లకు ఏమైంది అనుకున్నాను.. బీ ఫ్రాంక్.. మీరందరూ కూడా అదే అనుకొని ఉంటారు అల్లు అర్జున్ లంగా వోణి వేసి చేసిన పాట అయితే అబ్బో అంటూ రియాక్ట్ అయింది ఈ ముద్దుగుమ్మ . అయితే నిజానికి ఇది చాలా పాత వీడియో.. ఆ తర్వాత దీనిపై అనసూయ వివరణ కూడా ఇచ్చింది. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఈ వీడియో మళ్లీ వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. దాంతో మళ్లీ అనసూయ వార్తల్లో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news