వాజ్ పేయి అడుగు జాడల్లో నరేంద్రమోడీ నడుస్తున్నారు – పురందేశ్వరీ

-

వాజ్ పేయి అడుగు జాడల్లో నరేంద్రమోడీ నడుస్తున్నారని కొనియాడారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ. బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని వాజపేయి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వాజపేయి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ.

Purandeswari-tribute to vajpai

ఈ సందర్భంగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ మాట్లాడుతూ… సుపరిపాలన దినోత్సవంగా వాజపేయి జయంతి వేడుకలు అన్నారు. ప్రస్తుత అభివృద్ధికి నాడు వాజపేయి బీజం వేశారని వెల్లడించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ.

వాజ్ పేయి అడుగు జాడల్లో నరేంద్రమోడీ నడుస్తున్నారన్నారు. భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై పదాధికారుల సమావేశంలో చర్చించామని వివరించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ. రాజకీయాలకతీతంగా అందరూ కీర్తించే వ్యక్తిత్వం ఉన్న నేత వాజ్ పేయి…వాజ్ పేయితో గడిపిన ప్రతి క్షణం నేను నేర్చుకోవడానికి లభించిన గొప్ప అవకాశం అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news