వైసిపికి ఓటు వేయాలని రఘురామ రాజు కామెంట్… క్లారిటీ ఇదే

-

వైసిపికి ఓటు వేయాలని రఘురామ రాజు కామెంట్ చేశారు. మళ్ళీ 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలూ మావే అని రఘురామ రాజు అన్నట్లు ఓ వీడియొ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో వీడియోపై రఘురామ రాజు క్లారిటీ ఇచ్చారు.

వైసీపీ నాయకులు ఏ స్థాయికి దిగజారిపోయారంటే నేను మూడున్నర సంవత్సరాల క్రితం జగన్ ప్రభుత్వం గురించి భీమవరంలో మాట్లాడిన ఒక పాత వీడియోని ఇప్పుడు అమెరికాలో మాట్లాడినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని అగ్రహించారు రఘురామ రాజు. ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంది నా ప్రస్తుత పార్టీ అని ఫైర్ అయ్యారు. మళ్ళీ 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలూ మావే అని వెధవ పబ్లిసిటీ. సిగ్గులేని రాజకీయం! అని మండిపడ్డారు రఘురామ రాజు. ఈ నిరంకుశ అరాచక దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు విశ్రమించేది లేదు!! అని పోస్ట్ పెట్టారు రఘురామకృష్ణరాజు

Read more RELATED
Recommended to you

Exit mobile version