రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై కూలడంపై రఘురామ కీలక వ్యాఖ్యలు

-

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై కూలడంపై రఘురామకృష్ణ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ప్రజల చేత ఎన్నుకోబడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని రాజ్యసభలో వైకాపా ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని చురకలు అంటించారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాదాలు తీర్మానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించిన తీరు అద్భుతం అని కొనియాడారు.

రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు వస్తాయని, బీజేపీకి 360 స్థానాలు వస్తాయని చెప్పారే కానీ తమ పనికిమాలిన నాయకుల మాదిరిగా 175 స్థానాలకు గాను 175 స్థానాలు వస్తాయన్నట్టు… 540 స్థానాలకు గాను 540 లేదంటే 530 స్థానాలు వస్తాయని చెప్పలేదని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పోలీసులను చాచి లెంపకాయ కొట్టినట్లుగా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. జనవరి 12వ తేదీన తాను దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును పోలీసులు అమలు చేయడం లేదని, దీనిపై న్యాయమూర్తి గారు స్పందించి ఎంపీ, ఎమ్మెల్యేలకే ఇటువంటి పరిస్థితి ఉందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించడం జరిగిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news