Ramachandra Yadav Complaint On Ys Jagan : సీఎం జగన్ బిగ్ షాక్.. CM జగన్ పై భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 నుంచి వైసీపీ కార్యకర్త మొదలుకొని జగన్ వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకున్నారని…. దీనిపై విచారించాలని కోరారు.
![Ramachandra Yadav Complaint On Ys Jagan](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/11/Ramachandra-Yadav-Complaint-On-Ys-Jagan.png)
‘మద్యంలో రూ. 50 వేల కోట్లు, గ్రానైట్ తో రూ. 30 వేల కోట్లు, ఇసుకలో రూ. 12 వేల కోట్లు, పారిశ్రామిక, చుక్కల భూముల్లో రూ. 20వేల కోట్లు, ప్రాజెక్టులు, ఎర్రచందనం ద్వారా రూ. 24 వేల కోట్లు అవినీతి చేశారు’ అని పేర్కొన్నారు.
కాగా…సీఎం జగన్ ఇవాళ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తడ మండలం మాంబట్టు గ్రామంలోని స్పెషల్ ఎకనామిక్ జోన్ కు చేరుకుంటారు. అక్కడ ఫిషరీస్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ శాఖకు చెందిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.