చంద్రబాబు, పవన్ పై అంబటి రాంబాబు ఆగ్రహం..!

-

నిన్న, మొన్నటి వరకు వాలంటీర్ల వ్యవస్థ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు వాలంటీర్లకు రూ.10వేలు వేతనం ఇస్తామని ప్రకటించడం హాస్యస్పదంగా ఉందని పేర్కొన్నారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.

చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు కదా.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు. ఇప్పుడు ఒక్కరోజులోనే నాలుక మడతేశారు. చంద్రబాబు మాటలు ఈ దేశంలో ఎవరైనా నమ్ముతారా..? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. జగన్ మళ్లీ సీఎం అవుతారని అన్నీ  సర్వేలు చెబుతున్నాయి. కానీ చంద్రబాబు, ఎల్లో మీడియా మాత్రం జగన్ ఓడిపోతారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాయ మాటలు ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 2014లో విజయం సాధించినా చంద్రబాబు ఏపీ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version