జగన్‌ ను అన్‌ ఫాలో చేయలేదు.. రోజా క్లారిటీ !

-

మాజీ మంత్రి రోజా ఓటమి తర్వాత ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ ఓటమిపై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలు ఒక సునామీ లాగా జరిగిపోయిందని తెలిపారు రోజా. ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదన్నారు. ఇంత ఘోరంగా ఓడిపోయే తప్పులను వైసీపీ పార్టీ గాని ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గాని చేయలేదని వివరించారు రోజా.

roja jagan

ఎన్నికల్లో ఏం జరిగిందనేది ఈ రోజు కాకపోతే రేపైనా బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు మీ అందుబాటులో ఉన్నానని తెలిపారు‌‌. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ వచ్చాక మీకు అందుబాటులోనే ఉంటానని వెల్లడించారు రోజా. నిత్యం జగన్‌ తోనే ఉంటానని పరోక్షంగా చెప్పారు రోజా. కాగా వైసీపీకి రోజా రాజీనామా చేస్తుందని.. తమిళ రాజకీయాల్లోకి వెళుతుందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే.. ఆ వార్తల నేపథ్యంలోనే తాజాగా ఏపీ మాజీ మంత్రి రోజా క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version