చిరంజీవి గురించి మాట్లాడను..ఆయనను అభిమానిస్తా – రోజా

-

చిరంజీవి గురించి మాట్లాడను..ఆయనను అభిమానిస్తానని ఏపీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్ అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ‘నాగబాబు మనిషి పెరిగాడే కానీ బుర్ర పెరగలేదు. రాజకీయాల్లో లేని చిరంజీవిపై మాట్లాడను.

హీరోగా చిరంజీవిని ఎప్పటికీ అభిమానిస్తా. మెగా ఫ్యామిలీని ఎప్పుడు పర్సనల్ గా విమర్శించలేదు. సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్యకు, బాలకృష్ణ వీరసింహారెడ్డికి కలెక్షన్లు వస్తే, పవన్ కళ్యాణ్ కు మాత్రం చంద్రబాబు నుంచి కలెక్షన్లు అందాయి’ అని సెటైర్లు వేశారు రోజా.

చంద్రబాబు జీవో నెంబర్-1 కాపీలను భోగిమంటల్లో తగలబెట్టడంపై మంత్రి రోజా మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను చంద్రబాబు మంటల్లో కలిపారని ఫైర్ అయ్యారు. ఈ జీవోను ప్రజల కోసమే తెచ్చామని, చంద్రబాబుకు మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో సక్సెస్ అయిందని చెప్పారు. వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version