జగన్ భయపడి తిరుమల పర్యటన రద్దు చేసుకోలేదు- రోజా

-

జగన్ భయపడి తిరుమల పర్యటన రద్దు చేసుకోలేదని పేర్కొన్నారు రోజా. జగన్ పర్యటను అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల కుట్రలు చేసిందన్న రోజా…చంద్రబాబుపై సీరియస్‌ అయ్యారు. జనాలను మోసం చేసినట్టు స్వామి వారిని మోసం చేయాలనుకోవడం చంద్రబాబు భ్రమేనని… జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని తెలిపారు. భయపడలేదు కాబట్టే నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా మతం మానవత్వం అని చెప్పారని… బైబిల్ చదువుతారని ఇతర మతాలను గౌరవిస్తారని జగన్ చెప్పారన్నారు.

roja on ys jagan tirumala tour

చంద్రబాబుకు దేవుడు అంటే భయం భక్తి రెండు లేవని.. ప్రశాంతమైన వాతావరణంలో జగన్ దేవుని దర్శించుకుందామని వస్తే కూటమనేతలో దాడులు చేస్తామని హెచ్చరించారని ఆగ్రహించారు. వైసీపీ నేతలు అందర్నీ హౌస్ అరెస్టు చేసి నోటీసులు ఇచ్చారు..ప్రశాంత వాతావరణం లేదు కనుక జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారని వివరించారు. వైయస్ 5 సార్లు జగన్ 5 సార్లు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు… ఈరోజు కాకపోతే రేపైనా స్వామివారిని ఒక భక్తుడిలా జగన్ దర్శించుకుంటారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version