లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు

-

ఏపీ హైకోర్టులో చంద్రబాబు, లోకేష్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  ఫైబర్ గ్రిడ్ కేసులో బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు చంద్రబాబు, లోకేష్.  ప్రస్తుతం ఈ కేసు  విచారణ చేపడుతుంది హై కోర్టు. తాజాగా  స్కిల్ డెవలప్ మెంట్  కేసులో వచ్చే నెల 04 వరకు అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. దీంతో లోకేష్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

హైకోర్టుకు వెళ్లి ఈరోజు ముందస్తు బెయిల్ పిటిషన్ ఎందుకు వేసుకున్నారు. తప్పు చేయకుంటే కోర్టులో నిర్దోషిగా తేల్చుతుంది. తప్పు చేశావు కాబట్టే.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కి భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తానన్న లోకేష్.. భయపడి స్టేట్ వదిలి ఢిల్లీలో దాక్కున్నాడు. వాళ్ల బట్టలు, వీళ్ల బట్టలూడదీస్తానన్నారు. ఆ మాటలు ఇప్పుడు ఏమైంది అని ప్రశ్నించారు రోజా. చంద్రబాబు, లోకేష్  రౌడీ రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు మంత్రి రోజా. 

Read more RELATED
Recommended to you

Exit mobile version