అంబటి రాయుడిని అభినందిస్తున్నా : ఎంపీ రఘురామ

-

అంబటి రాయుడిని అభినందిస్తున్నానని చెప్పారు ఎంపీ రఘురామ. గుంటూరులో ఇంత నెగిటివిటీ ఉందని అంబటి రాయుడు అర్థం చేసుకొని అందుకే బయటపడ్డారని, ఇక కృష్ణదేవరాయలు గారు పోటీ చేయడానికి నిరాకరించారని రఘురామకృష్ణ రాజు అన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే ఆ పార్టీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందేనని రఘురామకృష్ణ రాజు గుర్తు చేశారు.

ఇప్పుడు మరో ఇద్దరు సనామదేయులు రెండు, మూడు రోజుల వ్యవధిలో టీడీపీలో చేరే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చూశానని, వాళ్ళు కూడా వైకాపాను వదిలేస్తున్నారంటే, ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు . రాజకీయాల్లో ఉన్నంత వరకు వైకాపాలోని కొనసాగుతానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినప్పటికీ, తిట్టమంటే తిట్టలేను, కట్టమంటే కట్టలేనని చెప్పి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు బయటపడిపోయారంటున్నారని, కృష్ణదేవరాయల గారిని గుంటూరుకు వెళ్ళమంటే, గుంటూరుకు వెళ్లడం ఇష్టం లేదని చెప్పారని, అమరావతి రైతులకు అంతగా అన్యాయం చేశాక మెడ మీద తలకాయ ఉన్న ఎవరైనా అక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటారా? అని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news