అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా..30 మంది ప్రయాణికులు !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏకంగా 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా కసింకోట వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. జంగారెడ్డి గూడెం నుండి విశాఖపట్నం వెల్తున్న ఆర్టీసీ బస్సు.. ఈ ప్రమాదానికి గురైంది.

ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు 30 మంది ప్రయాణికులు ఉండగా నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే.. పెద్ద ప్రమాదం జరుగకపోవడంతో…ప్రాణాలతో బయటపడ్డారు ప్రయాణికులు. ముందు వెళ్తున్న లారీని వెనక నుండి ఢీకొని అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది ఆర్టిసి బస్సు. ఇందులో బస్సు డ్రైవర్ తప్పిదం ఉందని..సమాచారం అందుతోంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version