గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లోకి పంట నష్టం పరిహారం

-

అకాల వర్షాలు ఈ ఏడాది రైతులను అరిగోస పెట్టాయి. అకాలంగా కురిసిన వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలా నష్టపోయిన రైతులకు తెలంగాణ సర్కార్ అండగా నిలిచింది. నష్టపోయిన పంటలకు పరిహారం ప్రకటించింది. ఈ మేరకు రూ.304.61 కోట్ల పరిహారాన్ని విడుదల చేస్తూ.. విపత్తుల నిర్వహణ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.

మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 27 వరకు రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. చేతికొచ్చిన పంటలను అకాల వర్షాలు రైతులకు దూరం చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి .. ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పంటనష్టంపై సర్వే చేసిన వ్యవసాయశాఖ రాష్ట్రవ్యాప్తంగా 2.79 లక్షల మంది రైతులకు సంబంధించిన 3.04 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించారు. దీనికి అనుగుణంగా ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.304.61 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ పరిహారం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version