ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. వైసిపి పార్టీ సీనియర్ నాయకులు మృతి చెందారు. అన్నమయ్య జిల్లా వైసీపీ పార్టీలో తాజాగా విషాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు, వ్యవసాయ సహాయ మండలి మాజీ చైర్మన్ పంచం సుకుమార్ రెడ్డి మృతి చెందారు.

చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వైసిపి నాయకులు సుకుమార్ రెడ్డి మరణించారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సుకుమార్ రెడ్డి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి మెరుగు పడలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరణించారు. ఇక సుకుమార్ రెడ్డి మృతి నేపథ్యంలో కార్యకర్తలు అలాగే పార్టీ నేతలు సంతాపం తెలుపుతున్నారు.