తండ్రి ఎవ్వరో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు.. పేర్నినాని సంచలన వ్యాఖ్యలు

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. గత 40 ఏళ్లలో చంద్రబాబు ఏనాడూ కూడా తన తండ్రి ఎవ్వరో ఈ ప్రపంచానికి చెప్పుకున్న దాఖలాలు లేవన్నారు. తన తండ్రి ఎవ్వరో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు ఉన్నాడని మండిపడ్డారు. సీఎం జగన్.. తాను రాజశేఖర్ రెడ్డి, విజయమ్మ కుమారుడిని అని చెప్పుకుంటారని తెలిపారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేని చంద్రబాబు సీఎం జగన్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి పేర్ని నాని.

తల్లి, తండ్రి చనిపోతే తలకొరివి పెట్టలేని వాడు.. నేటికి రామారావు అల్లుడినని చెప్పుకుంటాడని.. చంద్రబాబు పై మండిపడ్డారు పేర్నినాని. రాజకీయాల్లో చంద్రబాబు ఉండటం అనవసరం అన్నారు. పొలాల్లో తాటి చెట్టుకు, మర్రి చెట్టుకు కూడా వయస్సు వస్తుందని.. 80 ఏళ్ల వయస్సులో రాజకీయాల కోసం ఉక్రోషంతో దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా వైఎడస్సార్ సీపీ జెండాను కూడా టచ్ చేయలేడని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version