విశాఖ స్టీల్ ప్లాంట్ పై జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం

-

ఏపీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూలధనం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆహ్వానించిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ప్రజల తరపున బీడ్ వేయాలని ఏపీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తీసుకున్నారు.

ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు బీడ్ గడువు ముగుస్తుండగా అంత కంటే ముందే EOIకి అప్లయ్ చేస్తామని ప్రకటించారు జేడీ లక్ష్మీనారాయణ. కంపెనీల చట్టం చదువుకున్న వ్యక్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో భాగస్వామ్యం అవుతున్నాం….జనం తరపున మూడు గంటలకు నేను బీడ్ వేస్తున్నానని వివరించారు. ఈ రోజు పాదయాత్ర ట్రైలర్ మాత్రమేనని.. సినిమా ముందు చూపిస్తామని హెచ్చరించారు. ప్రయివేటీకరణ మీ విధానం అయితే ప్రజలు ఎలా తిప్పికొడతారో చూపిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version