షర్మిల అతని ఉచ్చులో పడిపోయింది : మంత్రి కొట్టు సత్యనారాయణ

-

ఏపీ కాంగ్రెస్ చీఫ్, సీఎం జగన్ సోదరి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ షర్మిలకు ఇంకా రాజకీయ పరిణితి రాలేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉచ్చులో షర్మిల పడ్డారని కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి వైఎస్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. సోదరుడు జగన్ ను అక్రమ కేసుల్లో ఇరికించిన కాంగ్రెస్ పార్టీలో చేరి.. షర్మిల తండ్రి ఆశయాలను గాలికి వదిలేశారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ ను విభజించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో షర్మిల చేతులు కలిపారని మండిపడ్డారు. అసలు షర్మిలను సీఎం జగన్ ఏం అన్యాయం చేశారో చెప్పాలని కోరారు. మరోవైపు టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొట్టు రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఫస్టే అధర్మాన్ని ఆశ్రయించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నా ఎవ్వరి దారి వారిదేనని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version