లిక్కర్ స్కామ్.. 5 గంటలుగా మిథున్‌రెడ్డిని విచారిస్తున్న సిట్‌

-

ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు కీలక నేతలకు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో కసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, విజయసాయిరెడ్డిలను విచారించిన సిట్.. తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డిని విచారిస్తోంది. ఇవాళ ఉదయం విజయవాడలోని సిట్‌ కార్యాలయానికి చేరుకున్న ఆయన్ను… గత ఐదు గంటలుగా అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు.

Mithun Reddy to appear before SIT officials for questioning today

విజయసాయి రెడ్డి ఇంట్లో 2 దఫాలుగా జరిగిన చర్చలపై మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అనంతరం మళ్లీ విచారణ కొనసాగిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు లాయర్ సమక్షంలో మిథున్‌ రెడ్డిని సిట్‌ చీఫ్‌ రాజశేఖర్‌ బాబు నేతృత్వంలోని బృందం ప్రశ్నిస్తోంది. ఈ సందర్భంగా రాజ్‌ కసిరెడ్డి, అవినాష్‌ రెడ్డి, చాణక్యరాజ్‌లతో సంభాషణలపై అతడిని ఆరా తీసినట్లు తెలిసింది. లిక్కర్ పాలసీపై జరిగిన సంభాషణలపైనా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి వెల్లడించిన వివరాల ఆధారంగా మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news