విడదల రజినిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె టీడీపీలో ఉన్నప్పుడు అభివృద్ధి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అభివృద్ధి అని బహిరంగ సభలో వ్యాఖ్యానించిన రజిని.. వైసీపీలో చేరిన తరువాత అవకాశాన్ని సృష్టించుకుని మరీ టీడీపీపై విమర్శల జల్లు కురిపించారు. అయితే తాడును తన్నే వాడు ఉంటే వాడి తలను తన్నే వాడు ఉంటాడని, మనం ఇతరులకు ఏం ఇస్తే మనకు తిరిగి అదే వస్తుందని పెద్దలన్న మాట మరోసారి రజిని విషయంలో ఋజువైందని పలువురు పేర్కొంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఫైర్ బ్రాండ్ శ్రీ రెడ్డి విడదల రజినిపై X వేదికగా బూతులు పురాణం వల్లించారు. మాజీ మంత్రి అయినటువంటి విడదల రజినిని వ్యాంక్గా శ్రీరెడ్డి సంబోధించారు. టీడీపీ శ్రేనులను రెచ్చగొట్టి గెలుపుకోసం వైసీపీ ప్రయత్నించిందని సోషల్ మీడియా న్యూస్ చానెల్లో చూపించారని, దీనికి కారణం విడదల రజినిని వెంట పెట్టుకుని తిరగడమే అని మండిపడ్డారు. రజినిని చెత్తతో పోల్చిన శ్రీ రెడ్డి.. రజినిని పక్కన పెట్టుకుంటే ఇలా జరుగుతుందని తాను ఈ విషయం ఎప్పుడో చెప్పానని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version