సీఎం కేసీఆర్ రియల్‌ హీరో..కచ్చితంగా మేము పొగుడుతాం – వైసీపీ ఎమ్మెల్యే

-

సీఎం కేసీఆర్ రియల్‌ హీరో..కచ్చితంగా మేము పొగుడుతామని స్పష్టం చేశారు శ్రీకాళహస్తీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ సచివాలయం ప్రకటన చూసి మురిసిపోయిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి… కేసీఆర్‌ పొగిడారు. ఇక అటు సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ అత్యంత నీచుడని తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు మధుసూదన్ రెడ్డి.

ఏపీ రాజకీయాలు, పరిస్థితులు రజనీకాంత్ కు ఏమి తెలుసు అని.. సినిమా ఇండస్ట్రీలో నీచుడు ఎవరనా ఉన్నారంటే అది రజనీకాంత్ నేనని వివరించారు. తన అల్లుడు తల్లిదండ్రులు ను అవమానించాడు రజనీకాంత్ అని.. సిగరెట్లు, బీడీలు పైకి ఎగరేసి నంత ఈజీ కాదు రాజకీయాలు అంటే అంటూ చురకలు అంటించారు.

 

సినిమా వేరే రాజకీయాలు వేరేనని.. ఎన్టీరామారావు సినిమా ఇండస్ట్రీలో కి వచ్చి ఎందరికో లైఫ్ ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీ పెడుతానని చెప్పి పెట్టకుండా హిమాలయ కు వెల్లినోడివి నువ్వు కూడా ఎపి రాజకీయాలు గురించి మాట్లాడుతావా అని చురకలు అంటించారు. ఒక సినిమా ఆఫర్లు ఇస్తానని చెబితే చంద్రబాబు గురించి పొగిడిన వాడివి నువ్వు.. విజనరీ అంటె చంద్రబాబు నాయుడు అన్నావని ఆగ్రహించారు. విజనరీ అంటే సీఎం కేసీఆర్ ది… హైదరాబాద్ లో 600 కోట్లతో సెక్రటేరియట్ నిర్మించారని కొనియాడారు శ్రీకాళహస్తీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version