ఫిబ్రవరిలో తిరుమల హుండీ ఆదాయం..36వ నెల కూడా 100 కోట్లు !

-

తిరుమల శ్రీవారికి ఆదాయమే ఆదాయం వస్తోంది. తిరుమలలో వరుసగా 36వ నెల కూడా 100 కోట్ల మార్క్ దాటింది శ్రీవారి హుండీ ఆదాయం. ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా 100.69 కోట్లు కానుకలుగా సమర్పించారు భక్తులు. ఇక అటు తిరుమలపై కుంభమేళా ఎఫెక్ట్‌ పడినట్లు చెబుతున్నారు..ఫిబ్రవరి నెలలో తిరుమలలో భక్తుల తాకిడి తగ్గింది.

Srivari Hundi revenue has crossed the 100 crore mark for the 36th consecutive month in Tirumala

నెలలో ఒక్కరోజు కూడా బయటకు క్యూ లైనులు రాలేదని టీటీడీ అధికారులు ప్రకటించారు. ఎక్కువ రోజులు కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండానే శ్రీవారి దర్శనం జరిగిందని అంటున్నారు. ఈ లెక్క ప్రకారం…ఫిబ్రవరి నెలలో తిరుమలలో భక్తుల తాకిడి తగ్గింది. ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారిని 19.12 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news