ఈనెల 10న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, రుణాలు అందించి వారికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగానే ఈనెల 10న సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగనుంది. 229, 230వ బ్యాంకర్ల సమావేశాలను ఒకేసారి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 17వ తేదీ ఎస్ఎస్బీసీ సమావేవం నిర్వహించారు. ఎల్లుండి జరుగబోయే సమావేశంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, పీ4 విధానం అమలు అంశాలపై ఎస్ఎల్బీసీ చర్చించనున్నది. 

ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం, వార్షిక రుణ ప్రణాళికలపై సమీక్ష, 228వ బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, యాక్సన్ టేకెన్ రిపోర్టు పై ఎస్ఎల్బీసీ చర్చించనున్నది. టిడ్కో ఇల్లు, డ్వాక్రా రుణాలు, ముద్ర రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వానిది లాంటి కేంద్ర పథకాలపై సమీక్షించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్ వర్క్ డిజిటల్ జిల్లాల అంశం పై చర్చించనున్నది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news