కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వర్చువల్ భేటీ..!

-

ఏపీ సచివాలయంలోని తన పేషీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0, శాస్కి స్కీమ్స్ సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందని మంత్రి వెల్లడించారు. అలాగే, సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు 60 శాతం పూర్తయ్యాయన్నారు. అన్నవరం దేవాలయ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొన్నాళ్లు పనులు నిలిచిపోయాయని  వివరించారు.

స్వదేశ్ దర్శన్ 2.0 క్రింద బొర్రా గుహలు- లంబసింగి ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. గండికోట ఫోర్టుకు సంబంధించిన టెండర్లు స్వీకరించామన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధి ప్రక్రియ ప్రస్తుతం టెండర్ దశలో ఉందని మంత్రి కందుల దుర్గేష్ చెప్పుకొచ్చారు. స్వదేశీ దర్శన్ క్రింద అభివృద్ధి చేయదలచిన నాగార్జున సాగర్, అహోబిలం, సూర్యలంక ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను త్వరతితగతిన ఆమోదించమని కేంద్ర మంత్రిని అభ్యర్థించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ఫెకావత్ సానుకూలంగా స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news