త్వరలోనే రాజమండ్రిలో స్టేడియం నిర్మిస్తాం – మంత్రి కందుల దుర్గేష్

-

త్వరలోనే రాజమండ్రిలో స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఎస్పీ ఆఫీస్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ…‌ గోదావరి పుష్కరాలకు సంబంధించి అన్ని రంగాల అభివృద్ధికి బృహతర ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. క్రీడా రంగానికి ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.

State Minister Kandula Durgesh inaugurated the cricket tournament held at the SP office ground in Rajahmundry

త్వరలోనే రాజమండ్రిలో స్టేడియం నిర్మించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. క్రీడ మైదానాలు అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. క్రీడలకు రాజమండ్రిలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు మంత్రి దుర్గేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version