చంద్రబాబుకు మద్దతుగా ఆ హీరో కొడుకు, కూతురు

-

ఏపీ మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయడానికి వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. పలువురు చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తుండగా… నందమూరి తారకరత్న పిల్లలు కూడా మీ వెంట మేము అంటూ మద్దతును తెలిపారు. టిడిపి అంటే తారకరత్నకు ఎనలేని అభిమానం. 40 ఏళ్ల వయసులోనే గుండె సమస్యతో కన్నుమూసారు.

taraka ratna children support to chandrababu naidu

తండ్రి తారకరత్న వారసత్వాన్ని కొనసాగిస్తు పిల్లలు ‘బాబుతో నేను’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించడం వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా జగన్‌ సర్కార్‌పై నారా బ్రాహ్మణి సంచలన పోస్ట్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం వైసీపీకి తగదని నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. “ప్రభుత్వ, బహుళ జాతి సంస్థలను వైసీపీ అపహాస్యం చేస్తోంది. పాలనలో వైసీపీ నేతలు అసమర్థులు. సీమెన్స్ మాజీ ఎండి అన్ని అనుమానాలు నివృత్తి చేశారు. వైసీపీ నేతలు మాత్రం కళ్ళు ఉండి కూడా వాటిని చూడలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు చంద్రబాబు వెంట ఉన్నారు” అని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version