మర్డర్ ప్లాన్: అఖిలప్రియ రూ.50 లక్షలు సుపారీ ఇచ్చిందంట!

-

సీమలో ఉన్నపలంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తనను చంపాలని చూస్తుందని, తన హత్యకు కుట్రపన్నిందని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీమ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఈ విషయంలో పోలీసులు వారిపని వారు చేయగా.. నిందితులు నిజాలు వెల్లడించారని.. ఇది కచ్చితంగా అఖిలప్రియ ప్లానే అని కన్ ఫాం చేస్తున్నాయి తాజా పరిస్థితులు.. అని చెబుతున్నారు ఏవీ సుబ్బారెడ్డి!

భుమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు, సహచరుడు అయిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడు.. తనను చప్పేందుకు కుట్రపన్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. అఖిలప్రియ – భార్గవ రాముడుల అనుచరులు.. రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సంజోరెడ్డితో చేతులు కలిపి తనను హతమార్చాలని చూస్తున్నారని సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఇదేక్రమంలో తనను చంప్పేందుకు ఇప్పటికే రూ.50 లక్షలు సుపారీ కూడా మాట్లాడేసుకున్నారని బాంబు పేల్చారు ఏవీ!

ఈ విషయాలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని, వారే కాపాడారని చెబుతున్న ఏవీ సుబ్బారెడ్డి… తనపై హత్యకు కుట్ర జరుగుతుందన్న విషయాన్ని కడప పోలీసులకు ఫిర్యాదు చేశామని, దీంతో భూమా అఖిలప్రియ కుట్రను పోలీసులు భగ్నం చేసి తనను కాపాడారని తెలిపారు సుబ్బారెడ్డి. అనంతరం పోలీసులు విచారణలో నిందితులు పలు నిజాలను వెల్లడించారని.. అందులో భాగంగా… అఖిలప్రియ అనుచరుడు శ్రీను తమకు డబ్బులు ఇచ్చాడని నిందితులు ఇప్పడికే చెప్పారని ఏవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఈ ఏవీ సుబ్బారెడ్డి తాజా ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news