చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత..!

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ-టీడీపీ నేతల మధ్య ఎప్పుడూ అగ్గి వేస్తే.. భగ్గు అన్నట్టుగా ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలను ఇబ్బందులకు గురి చేయడం.. టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ నేతలు భయపడటం సర్వసాధారణం. ఇటీవల టీడీపీ నేతలు ఎవ్వరినీ వదిలిపెట్టమని పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  గో బ్యాక్ పెద్దిరెడ్డి అంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పుంగనూరులో టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  తిరుపతిలో ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version