కూతురు నాలుక కోసి తినేసిన తల్లి

-

చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇద్దరు కూతుళ్ళను హత్య చేసిన తల్లి వ్యవహారం సంచలనం అయింది. ఇక ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన అక్క చెల్లెల హత్య కేసులో మరో కొత్త కోణం కలకలం సృష్టిస్తుంది. పెద్ద కుమార్తె అలేఖ్య నాలుక కోసి తల్లి పద్మజ తినేసినట్లు పుకార్లు వస్తున్నాయి. తాను కాళికాదేవి కాబట్టి అలేఖ్య నాలుక కోసి తిన్నట్లు తల్లి పద్మజ అంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.

తల్లీ పద్మజ నిజంగా అలేఖ్య నాలుక కోసి తిన్నదా.. లేదా అన్న వాస్తవం పోస్టుమార్టం రిపోర్టు వస్తే గాని నిర్ధారించి లేని పరిస్థితి ఏర్పడింది. ఇలా రోజుకో కొత్త కోణంలో అక్క చెల్లెల హత్య సంచలనం కలిగిస్తోంది. మదనపల్లి సబ్ జైలు నుంచి నిన్న తిరుపతి రుయా ఆసుపత్రికి తల్లిదండ్రులు పద్మజ , పురుషోత్తం నాయుడు లను వైద్యపరీక్షల కోసం తరలించారు. అక్కడ పరీక్షల అనంతరం వారిని తిరిగి రాత్రి మదనపల్లి సబ్ జైలు కు చేర్చారు.

విశాఖపట్నంలో వారికి పూర్తిస్థాయిలో మానసిక వైద్యం చేయాలని ఆసుపత్రి డాక్టర్లు నిర్ధారించారని తెలుస్తుంది. తాను శివుడుని తానే కరోనాను పంపించా అని తనకు కరోనా టెస్ట్ అవసరం లేదని ఆమె చెప్పడం ఇప్పుడు సంచలనం అయింది. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. వాళ్ళను అలా మార్చిన వారిని కాల్చి చంపాలి అని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version