విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌..పాలిసెట్ ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్‌

-

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలిటెక్నిక్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 88.74 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

1,59,989 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో లక్ష 41, 978 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఇక సెట్ ప్రాథమిక కీని ఈ నెల 30వ తేదీన విడుదల చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా మే మాసం పదవ తేదీలోపు ఫలితాలను వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news