సాక్షి కార్యాలయం ఫర్నీచర్ దహనంపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. సాక్షి కార్యాలయం ఫర్నీచర్ దహనం వార్తల్లో వాస్తవం లేదని.. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. గత మూడు రోజులుగా సాక్షి కార్యాలయం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న విషయాలేవీ వాస్తవం కాదని స్పష్టం చేశారు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. ఈ ఘటనపై ఏలూరు 3-టౌన్ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.